E-Paper
Advertisement

Tirumala : మళ్లీ చిరుత కలకలం.. శ్రీవారిమెట్టు మార్గంలో సంచారం..

Tirumala :  మళ్లీ చిరుత కలకలం.. శ్రీవారిమెట్టు మార్గంలో సంచారం..
Advertisement

Tirumala : తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపుతోంది. చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతను సోమవారం సాయంత్రం భక్తులు గుర్తించారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను పులివెందులకు చెందిన భక్తులు చూశారు.దీంతో తీవ్ర భయాందోళనకు గురవయ్యారు. ఆ తర్వాత తేరుకుని టీటీడీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

చిరుత సంచారంపై టీటీడీ అధికారుల అప్రమత్తమయ్యారు. కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి గుంపులుగా పంపుతున్నారు. చిరుత సంచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.

కొద్ది రోజుల క్రితం చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఆ అంతకుముందు ఓ బాలుడిపైనా దాడి చేసింది. ఆ రెండు ఘటనల తర్వాత టీటీడీ అధికారులు ఫారెస్ట్‌ సిబ్బంది సహాయంతో ఆపరేషన్‌ చిరుతను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 6 చిరుతలను బంధించారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు భక్తులు. అయితే మరోసారి చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

.

.

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×