E-Paper
Advertisement

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి
Advertisement

Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కోటంరెడ్డి ఏదోవిధంగా వైసీపీ పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేయనని స్పష్టం చేశారు.

తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు. మేయర్ సహా 11 మంది కార్పోరేటర్లు తనవెంట ఉన్నారని తెలిపారు. పార్టీవైపు వెళ్లినవారు .. రాజకీయంగానే కాదని.. మానసికంగా తనకు దగ్గరగా ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెబుతున్నారని.. వేల కోట్ల ఆస్తులున్న ఆదాలతో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాని వెల్లడించారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీ దారుగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

గతంలో మాదిరిగా ఆదాల అన్నిపార్టీలకు తిరగొద్దని సూచించారు. ఏ పార్టీలో ఉంటున్నారో.. ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ జేబులో పెట్టుకొని.. జగన్‌ను కలవడానికి వెళ్లాడని విమర్శించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని తెలిపారు. అలాగే అవకాశం వస్తే నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×