E-Paper
Advertisement

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు

Kesineni Brothers: ఉప్పు నిప్పుగా కేశినేని బ్రదర్స్.. బాబు చొరవతో వర్గపోరుకు శుభంకార్డు
Advertisement

Kesineni Brothers: బెజవాడలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయాలు ఇప్పుడు చల్లారాయి. కేశినేని బ్రదర్స్‌ మధ్య నెలకొన్న పొలిటికల్‌ వార్‌ టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో.. ఉప్పు నిప్పుగా ఉన్న కేశినేని నాని, చిన్నిల మధ్య రాజకీయ విబేధాలు సద్దుమణిగాయి.

గత రెండేళ్లుగా కేశినేని బ్రదర్స్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ సాగుతుండటంతో బెజవాడ రాజకీయాలు కాకరేపాయి. సోదరులిద్దరూ ఎంపీ సీటు కోసం పట్టుపట్టడంతో ఇరువురి మధ్య పొలిటిల్‌ వార్‌ స్టార్ట్‌ అయింది. ఇదిలా ఉంటే.. బుద్దా వెంకన్న కారణంగానే మొదట్లో చంద్రబాబుకి నాని దూరం అయ్యారు. ఇదే అదునుగా దేవినేని ఉమ చిన్నిను రంగంలోకి దించడంతో రాజకీయ రగడ రాజుకుంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రసవత్తరంగా పొలిటికల్‌ వార్‌ నడిచింది.

Advertisement

అయితే.. మరికొన్ని రోజుల్లోనే ప్రజా క్షేత్ర పోరు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలతో వీరి పంచాయితీ ముగిసినట్టయింది. మరల ఎంపీగా నానికి టికెట్‌ ఇస్తానని..పెనమలూరు గాని మైలవరం నుంచి కానీ చిన్నిని బరిలో దించుతానని హామీ ఇవ్వడంతో ఇద్దరు నేతలు కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పంచాయితీ ముగియడంతో కేశినేని బ్రదర్స్‌ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని.. కేవలం రాజకీయా డ్రామాలాడారని విమర్శిస్తున్నారు తోటి తెలుగు తమ్ముళ్లు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×