E-Paper
Advertisement

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి:  కాకాణి గోవర్ధన్
Advertisement

Kakani Govardhan: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ ఆరోపించారు. కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతే కాకుండా నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా హతమార్చారు. వ్యక్తిగత వివాదాలే అతడి హత్య జరిగిందని చెప్పడం దారుణం. రషీద్ హత్యపై ఎస్పీ తీరు సరికాదు. రషీద్‌ను హత్య చేసిన వ్యక్తి పేరు జిలానీ. అతడు టీడీపీకి చెందిన కార్యకర్త, రసీద్ హత్యకు సూత్రదారులను పోలీసులు గుర్తించాలని కాకాణి అన్నారు.

మాజీ లోక్ సభ సభ్యుడు రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు అతడిపై దాడులకు పాల్పడ్డారు. చివరకు మాథున్ రెడ్డి గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి. మూడు వేల కుటుంబాలు గ్రామాలను వదిలి వలస వెళ్లారని ఆరోపణలు చేశారు.

Advertisement

Also Read: పిన్నెల్లికి హైకోర్టులో షాక్.. బెయిల్ నిరాకరణ

రాష్ట్రంలో మహిళలు, మైనర్లలపై అఘాయిత్యాలు కూడా అధికమయ్యాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత మాటలు చూసి ఎంతో మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో కూడా కనబడటం లేదు. వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి. పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వైసీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి పాలన ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇదేనా వీళ్లు చేస్తున్న పాలన అని ప్రశ్నించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×