E-Paper
Advertisement

KA Paul: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు.. కెఏ పాల్ హాట్ కామెంట్స్

KA Paul: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు.. కెఏ పాల్ హాట్ కామెంట్స్
Advertisement

KA Paul: ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకుంటారు కొందరు నేతలు. అలాంటివారిలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌ ఒకరు. ఏ పార్టీ అయినా, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు.. చెప్పాల్సిన నాలుగు మీడియా ముందుకొచ్చి కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అలాంటి వారిలో కేఏ పాల్ ఒకరు.

పాల్‌ చెవిలో పడిన వార్త ఏమిటో తెలీదు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై దుమ్మెత్తిపోశారు. ఏకంగా కమ్యూనిటీ పేరుతో ఆయా నేతలను దుమ్ము దులిపేశారు. ఆనాడు చిరంజీవి, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇద్దరు నేతలు పార్టీలకు ప్యాకేజ్ స్టార్ అయ్యారని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

సిగ్గులేని వాళ్లు ‘డిప్యూటీ సీఎం గారి తాలూకా’ అని బోర్డు పెట్టుకుంటారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏపీ టూర్‌కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా స్లోగన్స్ చేయాలంటూ మెసేజ్‌లు చేపిస్తున్నారని మండిపడ్డారు. ఆవేశంలో మాట్లాడిన కేఏ పాల్, కావాలంటే తన పార్టీలో జాయిన్ కావాలని సూచన చేశారు.

పదవి రాలేదని ప్రధాని కాళ్లపై పడుతున్నారని తెలియజేశారు పాల్. ఇదే క్రమంలో మరో మాట చెప్పారాయన. సీఎం చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో తన తప్పులను చంద్రబాబు మీదకు నెట్టేసి 2029లో సీఎం కావాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ALSO READ: వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి

కేవలం పదవుల కోసమే తప్ప, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన నేతలకు ఉన్నట్లు కనిపించలేదన్నారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాశాంతి చీఫ్. హోదా విషయాన్ని ఎందుకు అడగడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు చిరంజీవి అమ్మడుపోగా, ఇప్పుడేమో బీజేపీ వంతైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొద్దిరోజులుగా బీజేపీకి చిరంజీవి టచ్‌లోకి వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీ హైకమాండ్‌కు ఆయన దగ్గరగా ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ఈ క్రమంలో పాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. ఆవేశంలో కేఏ పాల్ మాట్లాడినా, కొన్ని నిజాలు మాత్రం బయటపెడతారని అంటున్న నేతలు సైతం లేకపోలేదు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×