E-Paper
Advertisement

Janasena Protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన.. ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై నిరసన!

Janasena Protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన.. ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై నిరసన!
Advertisement

Janasena Protest Outside College in Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన కార్యకర్తలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఈవీఎంలు భద్రపరిచే ఎస్ఆ‌ర్కేఆర్ కాలేజీ గేటు బయట నిరసన తెలిపారు. ముఖ్యంగా ఈవీఎంలను ప్రైవేటు కారులో తరలించడాన్ని అడ్డుకున్నారు.

ఈవీఎంల సీళ్లు తొలగించినట్లు ఉన్నాయని ఆరోపించారు జనసేన నేతలు. ఇక్కడకు సమీపంలో వైసీపీ నాయకుల ఇళ్లు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఆందోళన చేస్తున్నవారికి నచ్చ జెప్పేందుకు పోలీసులు రంగం ప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నుండి ఎన్నికల పోలింగ్ మోనిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్‌కు ఈ విషయం తెలిసింది.

Advertisement

వెంటనే హుటాహుటిన ఎస్.ఆర్.కె.ఆర్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆ వాహనం రిజర్వ్డు ఈవీఎం‌లకు సంబంధించినదని వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు రెండు, మూడు రిజర్వుడ్ ఈవీఎం‌లను పంపడం జరుగుతుందన్నారు. వాటిని ఆయా వాహనాల్లో తీసుకుని వస్తున్నారని తెలిపారు. పోలింగ్‌కు వినియోగించిన ఈవీఎంలను తీసుకువచ్చే వెహికల్ కాదని స్పష్టంచేయడంతో గందరగోళ పరిస్థితి సద్దుమణిగింది.

Also Read: వారణాసికి బాబు, పవన్, మోదీ నామినేషన్‌కు హాజరు

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు మే 13న ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ఆరు వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు దాటినా ఓటర్లు క్యూలో ఉండడంతో  కంటిన్యూ చేశారు. దీంతో ఈవీఎంలను తీసుకొచ్చేందుకు అర్థరాత్రి దాటింది. ఈవీఎంల తరలింపును పసిగట్టిన జనసేన నేతలు భీమవరంలోకి ఎస్.ఆర్.కె.ఆర్ కాలేజీ కాలేజ్ గేటు బయట నిరసన చేపట్టారు. కాలేజ్ వద్ద సీసీకెమెరాలతోపాటు మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో దాదాపు 81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×