E-Paper
Advertisement

Janasena: నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ

Janasena: నాగబాబు సీటుపై జనసేన క్లారిటీ
Advertisement

Janasena: ఎట్టకేలకు జనసేన నేత నాగబాబు సీటుపై క్లారిటీ ఇచ్చేసింది ఆ పార్టీ. ఆయన్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ తెలిపింది. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది. ఇంతకీ నాగబాబుకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వనున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఏపీ రాజకీయాల్లో నేతల మాటల కంటే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. పార్టీకి చెందిన నేతలు లీకులు ఇస్తున్నారా? లేక వైసీపీకి చెందినవారు వాటిని క్రియేట్ చేస్తున్నారా? అనేది మాత్రం తెలీదు. నిజం తెలుసు కునే లోపు అబద్దం గుమ్మం దాటి పోతోంది. ఈ సామెత నాగబాబు విషయంలో నిజమైంది.

Advertisement

నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్టుల ట్విస్టుల వస్తున్నాయి. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నామని మూడు నెలల కిందట టీడీపీ హైకమాండ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అధినేత చంద్రబాబు సంతకంతో ఆ నోట్ రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు నాగబాబు మంత్రివర్గంలోకి ఎలా వస్తారు? ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని  ఇటు టీడీపీ అటు జనసేనలో లేదు. అప్పుడే దీనిపై రకరకాలుగా చర్చ జరిగింది.

ఎమ్మెల్యే కానీ వ్యక్తిని కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారు? పవన్ సోదరుడు కావడంతో మంత్రి చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు వైసీపీ, జనసేన, టీడీపీలోని ఓ వర్గం నుంచి రైజ్ అయ్యాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ విషయాన్ని ప్రస్తావించారు. తాను కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వీడియోలను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది.

Advertisement

ALSO READ: డిప్యూటీ సీఎం కంటే జగన్‌కు ఎక్కువ, మంత్రి లోకేష్ క్లారిటీ

నాగబాబు కేబినెట్‌లోకి తీసుకుంటున్నారని వార్త రాగానే విమర్శనాత్మమైన చర్చ జరిగింది. జనసేనలో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్, దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. మళ్లీ నాగబాబు కేబినెట్‌లో తీసుకొస్తే.. గెలిచిన 21 మంది ఎమ్మెల్సీలను కాదని సోదరుడికి ఎలా మంత్రి పదవి ఇస్తారని జనసేనలోని ఓ వర్గం ప్రశ్న లేవనెత్తింది. బీసీలు లేదా ఎస్పీ, ఎస్టీలను మంత్రిగా చేస్తే బాగుండేదన్న వాదన సైతం లేకపోలేదు.

ఈ వివాదం కొనసాగుతుండగానే గతంలో నాగబాబు.. టీడీపీ నేతలపై చేసిన కామెంట్స్ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వెనక్కితగ్గారనే వాదన సైతం లేకపోలేదు. నాగబాబు ఇష్యూని వైసీపీ వేరే లైన్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

నాగబాబు గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జనసేన పార్టీ కొన్ని లీకులు ఇచ్చిందని అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులు జనసేన ఆఫీసుకు వెళ్లినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపిస్తే హుందాగా ఉంటుందని భావించారట పవన్ కల్యాణ్.

రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ అసెంబ్లీ ఛాంబర్‌లో దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. నాగబాబుని రాజ్యసభకు పంపిద్దామని పవన్.. సీఎం చంద్రబాబుతో అన్నట్లు, ఆయన సరేనని చెప్పడం అనేది ఆ పార్టీ ఆఫీసు నుంచే లీకు వచ్చింది. జనసేనలోని ఓ వర్గం ఈ తరహా ప్రచారం చేస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి జరుగుతున్న పరిణామాలపై అధినేత పవన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×