E-Paper
Advertisement

Jagan Disproportionate Assets: ఆలస్యం ఎందుకు? టార్గెట్ నాలుగు వారాలు!

Jagan Disproportionate Assets: ఆలస్యం ఎందుకు? టార్గెట్ నాలుగు వారాలు!
Advertisement

YS Jagan news today

YS Jagan news today(AP political news): జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని సీబీఐని ప్రశ్నించింది. దీనికి గల కారణాలను చెబుతూ నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణ వేగంగా పూర్తి చేయాలని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

Advertisement

న్యాయస్థానం ప్రశ్నలకు సీబీఐ న్యాయవాదులు రిప్లై ఇచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్ కారణంగానే ఆలస్యమవుతోందని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కారాదని వ్యాఖ్యానించింది కోర్టు. సీఎం అనే కారణంగానే విచారణ జాప్యం జరగకూడదని, విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని తెలిపింది. ట్రయల్ సుదీర్ఘం సాగితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని, విచారణ జరుపుతున్న కోర్టులే ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ధర్మాసనం.

బెయిల్ రద్దు, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని స్పస్టంచేసింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఆయా పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×