E-Paper
Advertisement

AP : సీఐడీకి చుక్కలు చూపిస్తున్న ఆంజనేయులు.. మామూలోడు కాదుగా..

AP : సీఐడీకి చుక్కలు చూపిస్తున్న ఆంజనేయులు.. మామూలోడు కాదుగా..
Advertisement

AP : ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పట్లేదట. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఇవే రొటీన్ డైలాగులట. గంటల తరబడి విసిగిస్తున్నాడట. ఏది అడిగినా.. ఏమో అంటున్నాడట. అన్నం తినమంటే తినట్లేదట. నాకు అవసరం లేదంటూ మొండి చేస్తున్నాడట. ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు మూడు రోజుల పాటు కస్టడీలో సీఐడీ అధికారులకు చుక్కలు చూపించారని తెలుస్తోంది. సోమవారం 6 గంటల పాటు.. 80కి పైగా ప్రశ్నలు అడిగితే.. దేనికీ సరైన సమాధానం చెప్పలేదని అంటున్నారు. మంగళవారం కూడా అదే ధోరణి కంటిన్యూ చేశారని సమాచారం.

3 రోజులు మమ..!

Advertisement

ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన PSR ఆంజనేయులును మూడు రోజుల పాటు ప్రశ్నించింది CID. అయితే విచారనకు ఆయన ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పరిధిలో లేదని అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారట. పేరుకు మూడు రోజుల విచారణ జరిగినా.. పీఎస్‌ఆర్ నుంచి పెద్దగా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. మరోసారి కస్టడీకి కోరాలని సీఐడీ ఆలోచన చేస్తోంది.

PSR vs CID

Advertisement

అసలే సీనియర్ ఐపీఎస్. చట్టంలోని లూప్‌హోల్స్ అన్నీ తెలిసిన పర్సన్. అందుకే విచారణకు సహకరించకుండా ఇబ్బందిపెడుతున్నారని.. ఆయన్నుంచి నిజాలు రాబట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. తనకేమీ కాదనే ధీమాలో పీఎస్ఆర్‌ ఉన్నారట. అయితే, ఆధారాలు పక్కాగా ఉండటంతో.. ఈ కేసు నుంచి ఆయన బయటపడటం కూడా అంత ఈజీ కాదని సీఐడీ అధికారులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు?

మరోవైపు.. ఆంజనేయులుపై మరో కేసు నమోదయింది. వైసీపీ హయాంలో ఐపీఎస్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. దీనిపై ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం ఉంది. పీఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు లభించాయని.. పకడ్బందీగా కేసు ఫైల్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. అదే జరిగితే.. ఆంజనేయులు ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×