E-Paper
Advertisement

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..
Advertisement

AP E-Cabinet Meeting: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత పేపర్ లెస్ కేబినెట్ భేటీ నిర్వహించారు. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఈ-కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాతి ప్రభుత్వం పేపర్ తో కూడిన కేబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ-కేబినెట్ విధానాన్ని పునరుద్ధరించింది.

ఈ-కేబినెట్ భేటీలో అజెండా నుంచి నోట్స్ వరకూ.. సమాచారాన్నంతా ట్యాబ్ లోనే ఉంచారు. దానిలో ఉంచిన సమాచారం మేరకే ఒక్కో అంశంపై మంత్రివర్గం చర్చించింది.

Advertisement

Also Read: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం

ఏపీ ఈ-కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

Advertisement

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ పాతవిధానంలోనే టెండర్లను పిలిచేందుకు ఆమోదించింది. అలాగే కొత్త మద్యంపాలసీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేసింది.

రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించేందుకు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×