E-Paper
Advertisement

Guntur News: ఆ ఆలయం హుండీ లెక్కింపుకు సర్వం సిద్దం.. ఆ నోట్లు చూసి అంతా షాక్..

Guntur News: ఆ ఆలయం హుండీ లెక్కింపుకు సర్వం సిద్దం.. ఆ నోట్లు చూసి అంతా షాక్..
Advertisement

Guntur News: ఆ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. ఆలయం హుండీ లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడ వచ్చారు. ఇక హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఒక్కొక్క హుండీ లెక్కించేందుకు, హుండీలను తెరిచారు. అందులో ఒక హుండీలోని నగదును వేస్తున్న క్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు షాక్ కు గురయ్యారు. ఔను.. ఆ హుండీలో నుండి పడిన నోట్లను చూసి వారు అవాక్కయ్యారు. ఇంతకు అంతలా షాక్ కు గురవడానికి గల కారణం తెలుసుకుంటే, మీరు కూడ ఔరా అనేస్తారు. అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయం ఎంతో చారిత్రాత్మకమైనది కావడంతో నిరంతరం భక్తులు ఆలయానికి వస్తారు. ఇక్కడి స్వామి వారిని మొక్కు కుంటే చాలు, సకల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు కోరికలు తీరిన వెంటనే, ఇక్కడి హుండీలలో భక్తులు కానుకలు సమర్పిస్తారు. అలా హుండీలో గల కానుకలను ఆలయ అధికారులు లెక్కిస్తారు.

Advertisement

తాజాగా ఇదే ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలోని హుండీలను ఒకేచోటకు పోగు చేశారు. అలా పోగు చేసిన హుండీలలోని నగదును ఆలయ అధికారులు కింద వేశారు. అప్పుడే అసలు విషయాన్ని గుర్తించి అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. ఓ హుండీలో పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు బయటపడ్డాయి. అది కూడ రూ. 2 లక్షల 44 వేలు విలువ చేసే 2 వేల రూపాయల నోట్లు బయటపడడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. అసలే రూ. 2 వేల రూపాయల నోట్లు చెల్లవన్న విషయం అందరికీ తెలుసు. మరి ఏ భక్తుడు కానుకల రూపంలో నోట్లు వేశాడో కానీ, ఇప్పుడు చెల్లని నోట్లను ఏం చేయాలన్న ఆలోచనలో ఆలయ అధికారులు పడ్డారు.

Also Read: Janasena vs YCP: జనసేన వర్సెస్ వైసీపీ.. లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు!

Advertisement

ఈ నోట్లు రద్దు చేసిన సమయంలో మార్చుకొనేందుకు వీలున్నప్పటికీ, ఆ భక్తుడు ఇలా ఎందుకు చేశాడని అధికారులు చర్చించుకున్నారు. మొత్తం మీద చెల్లని రూ. 2 వేల నోట్లను పోగు చేసి భద్రంగా భద్రపరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×