E-Paper
Advertisement

Goods Train Derails in Nellore: నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్..పలు రైళ్లకు అంతరాయం

Goods Train Derails in Nellore: నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్..పలు రైళ్లకు అంతరాయం
Advertisement

Goods Train Derails in Nellore(Andhra news today): ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

నెల్లూరు జిల్లా గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో విజయవాడ వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో మరో రైలు రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

ప్రస్తుతం ఘటన స్థలం వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. బోగీలను తొలగించి సవరిస్తున్నారు. అయితే ఈ సమయంలో అత్యవసర రైళ్లను మాత్రం మూడో లైన్‌లో పంపించేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే బిట్రగుంట రైల్వే స్టేషన్ కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవెల్ క్రాసింగ్ గేటు దగ్గర గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్డు వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి ఆ తర్వాత గూడ్స్ రైలు పట్టాలను పునరుద్దరిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×