E-Paper
Advertisement

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు

New Ration Cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలోనే అందరికీ కొత్త రేషన్ కార్డులు
Advertisement

Good News to People New Ration Cards in Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే అందరికీ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసేలా కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినేట్ సమావేశం కానుంది. ఇందులో భాగంగనే కొత్త రేషన్ కార్డు అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు పౌర సరఫరా శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం ధ్యానం బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకాయిలు రూ. రూ.1674.40 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. తొలత రూ.1000 కోట్లు విడుదల చేయగా.. తర్వాత రూ.674కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో విడుదల చేసింది.

Also Read:  ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Advertisement

కొత్త రేషన్ కార్డుతో పాటు కుటుంబాల విభజన, కుటుంబ సభ్యులను చేర్చడం, కుటుంబ సభ్యుల తొలగింపు, అడ్రస్ విషయంలో మార్పులు, చేర్పులు, పాత కార్డులను సరెండర్ చేయడం వంటి విషయాలపై కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, వాహనాల ద్వారా రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో వాహనాల్లో రేషన్ సరుకుల పంపిణీపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోనని డీలర్లు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు 6వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు మరో కొత్తగా 4వేలకు పైగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం రూ.12వేల కంటే ఎక్కువగా ఉంటే రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులు కాదని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో అంగన్ వాడీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. దీంతో మాకు వస్తున్న జీతాలు చాలా తక్కువని, ఈ జీతాలతో కుటుంబాలకు ఎలా పోషించాలని వాపోతున్నారు. కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, మళ్లీ తమకు కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×