E-Paper
Advertisement

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..
Advertisement

Ganta Srinivas Rao : ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఒకవైపు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికి మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు మొత్తం 11 అంశాలతో మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానించారు.

మరోవైపు వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు.

Advertisement

నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో చేసిన ఘన కార్యాలను చెప్పడానికి ఈ ఒక్క చిత్రం సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి.. అంటూ గంటా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఏపీ హేట్స్‌ జగన్‌’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్‌’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ ?’’ అని సెటైర్ వేశారు.వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్‌ లో ఫోటో షేర్‌ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×