E-Paper
Advertisement

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?

Breaking News: విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికకక్కడే మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే?
Advertisement

Breaking News: తమ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆ యువకులు. కానీ ప్లెక్సీలు కడుతుండగా, దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ కు గురై నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకై, ప్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29) పలువురు యువకులు నిమగ్నమయ్యారు.

అయితే ఈ నలుగురు ప్లెక్సీని కట్టే క్రమంలో ప్రక్కనే గల విద్యుత్ తీగలు తగిలి నలుగురు యువకులు షాక్ కు గురయ్యారు. స్థానికులు వీరిని రక్షించేలోగానే వీరు అక్కడే కన్నుమూశారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా, తణుకు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

వివాదం నుండి విషాదం వరకు..

తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షలు కూడా తలెత్తాయి. చివరికి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో సమస్య పరిష్కారమైంది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధన కు ఏర్పాట్లు చేస్తుండగా, దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది.

Advertisement

4 రోజుల క్రితం ఇక్కడే ఇద్దరు మృతి..

ఇదే ఉండ్రాజవరం మండలంలో నాలుగు రోజుల క్రితం క్రాకర్స్ తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు సజీవ దహనమైన విషయం తెలిసిందే. అలాగే ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇదే మండలంలో ఇద్దరు, నేడు ప్లెక్సీలు కడుతూ నలుగురు మృతి చెందారు.

విద్యుత్ షాక్ తో తమ పిల్లలు మృత్యువు బారిన పడగా, ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో తాడిపర్రు గ్రామంలో ఎటు చూసినా రోదనలే వినిపిస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×