E-Paper
Advertisement

Raghu Veera Reddy: ఆర్టీసీ బస్సులో సామాన్యుడిలా.. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రయాణం

Raghu Veera Reddy: ఆర్టీసీ బస్సులో సామాన్యుడిలా.. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రయాణం
Advertisement

Raghu Veera Reddy: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఒకప్పుడు దగ్గరైనవన్నీ.. తర్వాత రోజుల్లో దూరమవుతాయి. అలాంటి సందర్భాలు ఉన్నాయి. మన కళ్ల ముందు ఎంతో మందిని చూస్తాము.. చూస్తుంటాము కూడా. అందుకు ఎగ్జాంఫుల్ మన కళ్ల ముందు కనిపిస్తున్న వ్యక్తి ఎవరోకాదు మాజీ మంత్రి రఘువీరారెడ్డి.

మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైన నేత. ప్రస్తుతం సాదారణ జీవితం గడుపుతున్నారు. తన ఊర్లోవున్న భూమిలో పంటలు పండించు కుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణ జీవితం గడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే చిన్న మోపెడ్ మీద ట్రావెల్ చేస్తున్నారు.

Advertisement

వేరే జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సును ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ రఘువీరారెడ్డి సొంతూరు అనంతపురం జిల్లా. నీలకంఠాపురం ఆయన గ్రామం. చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేశారు. బస్సులో రాజకీయ అవగాహన ఉన్నవారు ఆయన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరారెడ్డి. ఆ తర్వాత కల్యాణ దుర్గం నియోజకవర్గానికి మారిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఆయనకు అభిమానం అంతాఇంతా కాదు. ఆ అభిమానమే రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసింది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.

Advertisement

ALSO READ: తిరుపతిలో బాధితులకు మంత్రులు పరామర్శ.. కుటుంబాలకు సాయం, పవన్ ఎక్కడంటూ విపక్షం ప్రశ్నలు

ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. వ్యవసాయ వృత్తిని చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పండుగలు, ఊర్లో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా కనిపిస్తారు. ఆ తర్వాత తన పని తాను చేసుకుపోతారు. రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడినా లైట్ నవ్వి సైలెంట్ అయిపోతారు. రాజకీయాల్లోకి చాలామంది వస్తారు.. కానీ నేతలు కొద్దిరోజులు మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ తర్వాత సాధారణ జీవితమే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×