E-Paper
Advertisement

Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?

Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?
Advertisement

Vijayawada News: హోటల్స్, రెస్టారెంట్ లో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అప్పుడప్పుడు తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటి ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది మరొక ఫుడ్ ను తీసుకురావడం మనం తరుచుగా వార్తల్లో వింటూనే ఉంటాం. కొన్ని సార్లు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి హోటల్ సిబ్బంది సారీ చెప్పి వెంటనే వారు చెప్పిన ఫుడ్ తీసుకొస్తారు. కానీ విజయవాడలో ఓ హోటల్ సిబ్బంది ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ ఎందుకు ఇచ్చారని అడిగినందుకు డైరెక్ట్ కత్తితో రప్పారప్పా పీకను కోసేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇలా స్టార్ట్ అయ్యింది గొడవ…

Advertisement

విజయవాడ నగరంలోని వెల్ కమ్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ఓ అబ్దుల్ కరీమ్ అనే యువకుడు టిఫిన్ కోసం హోటల్ కు వెళ్లాడు. మెనూ మొత్తం చూసేసి కరీమ్ ఉప్మా దోశ ఆర్గర్ ఇచ్చాడు. హోటల్ సిబ్బంది మిస్టేక్ లో ఉప్మా దోశకు బదులు ప్లెయన్ దోశను పార్సిల్ కట్టారు. యువకుడు ఇంటికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేయగానే ఉప్మా దోశకు బదులు ప్లెయిన్ దోశ దర్శనమిచ్చింది. దీంతో కరీమ్ నేరుగా హోటల్ వద్దకు వెళ్లి.. తాను చెప్పిన ఆర్డర్ కాకుండా వేరే ఫుడ్ ఎందుకు పార్సిల్ కట్టారని అక్కడున్న సిబ్బందిని నిలదీశాడు. అంతే.. ఇక హోటల్ సిబ్బందికి, అబ్దుల్ కరీమ్ కు మధ్య వాగ్వాదం స్టార్ట్ అయ్యింది.

పీక రప్పారప్పా కోసేశారు.. 12 కుట్లు..?

Advertisement

ఈ వాగ్వాదం కాస్త.. పెద్ద గొడవకు దారి తీసింది. సిబ్బందికి, కరీంకు మధ్య మాటా మాట పెరిగి చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఆవేశంలో హోటల్ సిబ్బందిలో ఒకరు కరీమ్ పై కత్తితో దాడికి దిగాడు. దాడిలో కరీమ్ మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం కరీమ్ అక్కడ జరిగిన పరిస్థితిని అంతా వీడియోలో చూపించాడు. అబ్దుల్ కరీం మెడభాగం పై తీవ్రగాయం కావడంతో డాక్టర్లు 12 కుట్లు వేసి వైద్యం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొత్త పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశాడు. వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని అడిగినంత మాత్రాన కత్తితో పీక కోస్తారా.. అని ఓ వ్యక్తి హోటల్ సిబ్బందిని అడగినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ALSO READ: Ichthyosis Vulgaris: ఇదో వింత వ్యాధి, లక్షణాలు గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం

మరీ ఇంత ఘోరమా..?

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ తప్పుగా ఇవ్వడమే కాకుండా.. తిరిగి యువకుడిపైనే దాడి చేయడం ఏంటి..? అని కామెంట్ చేసుకొచ్చాడు. మరి కొంతమంది.. ‘ప్రశ్నించినందుకు కత్తితో అంత ఘోరంగా దాడి చేస్తారా..? ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఫైరవుతున్నారు.

ALSO READ: Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×