E-Paper
Advertisement

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం
Advertisement

Food Checking Labs in AP: గత వైసీపీ పాలనలో ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల విషయమై భారీగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఆహార భద్రత, ప్రమాణాల ర్యాంకును పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఆహార నాణ్యతను నిర్ధారించే ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఓ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

Advertisement

కాగా, ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం కూటమి ప్రభుత్వం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేసేందుకు ఫుడ్ చెకింగ్ సంస్థ ఒప్పందంలో భాగంగా అంగీకరించింది. ఢిల్లీలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం కర్నూలు, తిరుపతిలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు.

Also Read: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

Advertisement

ఇదిలా ఉంటే.. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే ఆహార భద్రత, ప్రమాణాల్లో ఏపీ ర్యాంక్ దిగజారిందింటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ సర్కారు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఆహార భద్రత తనిఖీల కోసం స్పెషల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలుత 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వీటితోపాటు 15 మొబైల్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ కు ఒక్కోదానికి రూ. 21 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అదేవిధంగా విశాఖలో కూడా మైక్రో బయాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×