E-Paper
Advertisement

Extortion in Education Scheme: విద్యాకానుకలో అవినీతి.. వందలకోట్లను దోచుకున్న వైసీపీ..!

Extortion in Education Scheme: విద్యాకానుకలో అవినీతి.. వందలకోట్లను దోచుకున్న వైసీపీ..!
Advertisement

Extortion in Education Scheme by YCP in AP: ఏపీలో ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు కూటమికి జై కొట్టిన విషయం సుస్పష్టంగా తెలిసింది. కానీ.. అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ నేతలు.. తమ ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. ఈవీఎంలలోని ఓట్లలో ఏదో స్కామ్ జరిగిందని ఒకరు, ఓట్లను సరిగ్గా లెక్కించలేదని మరొకరు, కాదు కాదు.. మా సమస్యల్ని జగన్ తో చెప్పుకోనివ్వకుండా చేశారని ఇంకొకరు, ప్రజలే మోసం చేశారని మరికొంతమంది.. ఇలా వైసీపీ నేతలు తమ ఓటములకు కారణాలు రకరకాలు చెప్పుకొస్తున్నారు. కానీ.. వైసీపీ ఓటమికి కారణం ఆ పార్టీనేతల నోటి దురుసు. ఈ విషయాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు.

ఏపీలో జగనన్న విద్యాకానుక పేరుతో వైసీపీ ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టిన వార్తొకటి బయటికొచ్చింది. విద్యార్థులకు స్కూల్ బ్యాగుల కిట్లు ఇచ్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రూ.150 కోట్ల సొమ్మును ఆ శాఖ మంత్రి, ఆయన పీఏ, అధికారులు తినేశారన్న ఆరోపణలున్నాయి. లెక్కకు మించిన సామాగ్రిని కొన్నట్లు లెక్కలు చూపించి.. సరఫరా లేకుండానే నిధులను స్వాహా చేసేశారు. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయినా పట్టించుకోలేదు. విద్యాకానుక కోసం టెండర్లు పిలవకుండా.. గుత్తేదార్లకే సరఫరా బాధ్యతలను అప్పగించి డబ్బుల్ని దండుకున్నారన్న విమర్శలున్నాయి.

Advertisement

వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కిలకంగా ఉన్న మంత్రి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. పాతగుత్తేదార్లకు రూ.772 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. పాఠశాలల్లో ఉన్నది 36.54 లక్షల మంది విద్యార్థులైతే.. విద్యాకానుక కిట్లు 39.51 లక్షలు ఆర్డర్లు ఇచ్చారు. కాగితం ధర తగ్గినా.. ఒక్క నోట్ బుక్ కు పాత ధరకే ఇచ్చారు.

Also Read: ఏపీలో ప్రముఖ న్యూస్ ఛానళ్ల ప్రసారాలు బంద్.. బ్లూ మీడియాకు బిగ్ షాక్ ?

Advertisement

2023-24 విద్యాసంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగ్లు 2-3 నెలల్లోనే చిరిగిపోయాయి. మళ్లీ ఆ గుత్తేదారుకే బ్యాగ్ ల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. 2023లో జరిగిన ఆడిట్ లో.. ప్రజాధనంగా కోట్ల రూపాయల్లో వృథా అయినట్లు తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ లెక్కలన్నింటినీ బయటికి తీసి.. ఎవరెంత నొక్కేశారో లెక్కలు చూసి ఏం చేస్తుందో చూడాలి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×