E-Paper
Advertisement

Neeraja Reddy: మాజీ ఎమ్మెల్యే మృతి.. మరీ ఇంత బ్యాడ్‌లక్కా?

Neeraja Reddy: మాజీ ఎమ్మెల్యే మృతి.. మరీ ఇంత బ్యాడ్‌లక్కా?
Advertisement
Neeraja-reddy

Neeraja Reddy: పాటిల్ శేషిరెడ్డి. పత్తికొండ ఎమ్మెల్యే. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థుల చేతిలో చనిపోయారు. భర్త పోయాక.. భార్య నీరజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఓసారి ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. ఇప్పుడు విధి ఆడిన నాటకానికి బలైపోయారు.

ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతున్నట్టుంది. భర్త అలా.. భార్య ఇలా.. చనిపోవడం బాధాకరం. కర్నూల్‌ నుంచి హైదరాబాద్ వస్తున్నారు పాటిల్ నీరజారెడ్డి. అంతలోనే ఢాం అంటూ పెద్ద శబ్దం. కారు వెనుక టైరు పగిలిపోయింది. వేగంగా వెళ్తున్న వాహనం పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నీరజారెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుప్రతిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయారు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి. గద్వాల్ జిల్లా బీచుపల్లి దగ్గర జరిగిందీ ప్రమాదం. కారు టైరు పగిలి చనిపోవడం బ్యాడ్‌లక్ కాక మరేంటి!

Advertisement

భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు నీరజారెడ్డి. 2004లో పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ఆలూరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు నీరజారెడ్డి.

ఉన్నత విద్యావంతురాలైన నీరజారెడ్డి ఇప్పుడిప్పుడే బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. బళ్లారిలో నివాసం ఉంటూ తరుచూ ఆలూరు వచ్చివెళ్తుంటారు. రెగ్యులర్‌గా ప్రయాణాలు చేసే ఆమెను.. అదే ప్రయాణం కబళించడం శోచనీయం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×