E-Paper
Advertisement

Trolling On Roja: రోజా కంటతడికి రోజా మాటలే సమాధానం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Trolling On Roja: రోజా కంటతడికి రోజా మాటలే సమాధానం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
Advertisement

“విధి ఎవ్వడినీ విడిచిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం ఎవర్ని ఏదైనా అంటాం. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చే నిన్ను ఎవరూ జాలితో చూడరని గుర్తుంచుకో.” గతంలో చంద్రబాబుని ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలివి. అయితే ఇప్పుడీ వ్యాఖ్యలు మరోసారి హైలైట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దొంగ ఏడుపులు అనే పాయింట్ ని హైలైట్ చేస్తూ నెటిజన్లు రోజా వీడియోని వైరల్ చేస్తున్నారు.

Advertisement

అప్పుడలా.. ఇప్పుడిలా..
మీడియా ముందు ఏడిస్తే దొంగ ఏడుపులు అంటూ రోజా గతంలో చాలా సార్లు చెప్పారు. కష్టం ఎదురైతే ధీటుగా ఎదుర్కోవాలని, ఏడవడం సరికాదని చాలామందిని కామెంట్ చేశారు. అలాంటి రోజా.. ఇటీవల వైసీపీ సొంత మీడియా ఛానెల్ లో జరిగిన చర్చలో కంటతడి పెట్టారు. సహజంగా మహిళా నేత కంటతడి పెడితే ఎవరైనా సానుభూతి చూపిస్తారు. ఆమెకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజాపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఎందుకంటే గతంలో ఆమె ఏడ్చే రాజకీయ నాయకుల గురించి చేసిన కామెంట్లు అలాంటివి మరి. ఆమె కామెంట్లను, ఆమె వీడియోకే సమాధానంగా పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

అసలేమైంది..?
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు రోజా. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా ప్రదర్శించారు. ఆయనపై పోలీస్ కేసు కూడా పెట్టారు. ఈ క్రమంలో టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె.. గతంలో కూడా తనపై తప్పుడు పోస్ట్ లు పెట్టారని, ఫేక్ ఫొటోలు ప్రచారం చేశారని, వాటిని తన కుటుంబ సభ్యులకు కూడా పంపించి వికృతానందం పొందారంటూ కంటతడి పెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ వర్గం కూడా రోజా పాతవీడియోలను వైరల్ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు రోజా చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను బయటకు తీశారు. అందులో బూతులు కూడా ఉన్నాయి. బూతులే కాదు, మరీ జుగుప్సాకరంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వివాదంలో తప్పెవరిది అని తేల్చి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముందు రోజానే తమ నేతపై తప్పుగా మాట్లాడారని గాలి భానుప్రకాష్ వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా ముందు వాపోయారు.

Advertisement

రోజా తిట్టారు. రోజా తిట్టించుకున్నారు. కానీ ఇక్కడ ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ సింపతీ కోసం ట్రై చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రోజా వీడియోలను మరోసారి వైరల్ చేస్తూ ఆమె చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడకూడదంటున్నారు. రోజా ఒకవేళు ఎత్తి చూపితే, నాలుగు వేళ్లు ఆమెను చూపిస్తున్నాయనే విషయం మరచిపోకూడదంటున్నారు. మొత్తమ్మీద రోజా వీడియోలు మాత్రం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×