E-Paper
Advertisement

Ex Minister Balineni: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల పందెం కాసా : ఏపీ మాజీ మంత్రి

Ex Minister Balineni: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల పందెం కాసా : ఏపీ మాజీ మంత్రి
Advertisement

Ex Minister Balineni: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు వెల్లడించారు. ఇప్పుడివే కామెంట్స్ హాట్ గా మారాయి. మరో వ్యక్తి తెలంగాణ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. కానీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినా.. తాను పందాన్ని రద్దు చేసినట్లు బాలినేని వెల్లడించారు .

అంతే కాదు రాజకీయాలపైన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతోందన్నారు బాలినేని. అంతే కాదు ఈనాటి రాజకీయాలు అన్నీ కుల ప్రాతిపదికగా జరగుతున్నాయన్నారు. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నట్లు బాలినేని వెల్లడించారు. తాను అన్నీ నిజాలే మాట్లాడతానన్న బాలినేని.. డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టారు. లేనిపక్షంలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు సినిమాలపై ఇష్టం ఉండేదని, సినిమా తీయాలని కోరికగా ఉండేదన్నారు. ఇప్పుడు సినిమాల వైపే వెళ్లాలని ఉందని, ఇక్కడ ప్రజలు తనను కావాలనుకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. సీఎం జగన్ అంటే తనకు చాలా ఇష్టమన్న బాలినేని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×