E-Paper
Advertisement

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!
Advertisement

Eswar Reddy: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత ఈశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే తండ్రీకొడుకులు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

డైవర్షన్ పాలిటిక్స్.. మతిభ్రమించిన చెవిరెడ్డి

Advertisement

నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కూటమి సభ సక్సెస్ కావడాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఈశ్వర్ రెడ్డి విమర్శించారు. తనపల్లి నుంచి జాతీయ రహదారికి నూతన రోడ్లు వేయడం, కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించడం వంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఎస్ఐఆర్ (SIR) వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే చెవిరెడ్డి సోషల్ మీడియా వేదికగా భూకబ్జా డ్రామాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అసలు అవిలాలలో 150 కోట్ల రూపాయల స్థలం ఎక్కడ ఉందో చూపించాలని సవాల్ విసిరారు. చెవిరెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని, అందుకే కలెక్టర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, చంద్రగిరి ఎమ్మార్వోను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read: 858 హాట్ స్పాట్స్, 40 వేల ‘ఈగల్ క్లబ్స్’.. గంజాయిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం!

Advertisement

తుడా అవినీతి.. సొంత తమ్ముడికే ద్రోహం

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, చెవిరెడ్డి కుటుంబం గతంలో ఎమ్మెల్యేగా, తుడా (TUDA) చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఈశ్వర్ రెడ్డి ఆరోపించారు. తుడా పరిధిలో వారు చేసిన అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందన్నారు. చివరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన సొంత తమ్ముడు హర్షిత్ రెడ్డి రాజకీయంగా పైకి రాకుండా అడ్డుపడుతున్నాడంటూ కుటుంబ అంతర్గత రాజకీయాలను ప్రస్తావించారు.

కోవర్టు రాజకీయం.. పురుషోత్తం నాయుడు గుట్టుమట్లు

బీజేపీ నేత పురుషోత్తం నాయుడు ఒక వైసీపీ కోవర్టు అని ఈశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషోత్తం నాయుడు అనాధీనం భూములను కబ్జా చేశాడని, ఆ కబ్జాకు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే సహకరించలేదనే కక్షతోనే ఎమ్మెల్యేపై బురదజల్లుతున్నాడని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘పురుషోత్తం నాయుడు నా దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కూడా చెల్లించలేదు. నా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నాకు తిరిగి ఇవ్వకపోవడమేంటి? నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి నా ఆర్థిక లావాదేవీలను తేల్చుకుంటాను’ అంటూ ఈశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×