E-Paper
Advertisement

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?
Advertisement

Duvvada – Madhuri: ఆ జంట ఏది చేసినా, మాట్లాడినా వైరల్ కావాల్సిందే. సోషల్ మీడియాలో వీరికి ఉండే, క్రేజ్ అటువంటిది మరి. అటువంటి జంట దీపావళి రోజు.. ఒకరి చేయి ఒకరు పట్టుకొని దీపాలు వెలిగించారు. టపాసులు కాల్చారు. ఆ జంట ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. దీపావళి రోజు ఆనందంగా దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన ఆ జంట ఏమి చెప్పారంటే?

టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇక పొలిటికల్ లీడర్ గా దువ్వాడకు ఎంత గుర్తింపు ఉందో.. అదే గుర్తింపు సోషల్ మీడియాలో మాధురికి ఉంది. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాద సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. అయితే ఒకరికి ఒకరు తోడుగా మాత్రమే ఉంటున్నామని, తమ మధ్య ఉన్న బంధాన్ని చెడుగా అనుకోవద్దు అంటూ పలుమార్లు మీడియాతో మాధురి అన్నారు.

Advertisement

అయితే దువ్వాడ వివాదం సమయంలో మాధురి అండదండగా ఉన్నారు. దీనితో వీరి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా కోడై కూసింది. ఏదిఏమైనా వీరివురు న్యాయపరమైన చిక్కులు వీడిన అనంతరం ఒక్కటవుతారని అందరూ భావించారు. ఇటీవల దువ్వాడకు సంబంధించిన కుటుంబ వివాదం కొంత సద్దుమణిగిన స్థితిలో.. మాధురి సోషల్ మీడియాలో స్పీడ్ అయ్యారనే చెప్పవచ్చు. ఈమెకు సోషల్ మీడియా పరంగా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతి వీడియో వైరల్ కావాల్సిందే.

తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. అక్కడ మాధురి మాట్లాడుతూ.. కోర్టులో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే.. తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఆ సమయంలోనే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు, అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా మాధురి మాట్లాడినట్లు ఆరోపిస్తూ టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు తాజాగా 41ఏ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Also Read: Breaking news: కుశ్నపల్లిలో టెన్షన్.. టెన్షన్.. వెనక్కు తగ్గిన అఘోరి.. చివరకు?

ఇది ఇలా ఉంటే టెక్కలి లోని తమ నివాసంలో ఈ జంట ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. కొత్త ఇంటిని లైటింగ్ తో అందంగా అలంకరించారు వీరు. కొత్త ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటి ఆవరణంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురీలు ప్రమిదలను వెలిగించారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలంటూ లక్ష్మీదేవికి పూజ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్, మాధురి తెలిపారు. అలాగే అందరి జీవితాల్లో కమ్ముకొన్న చీకటి తొలగి, వెలుగులను ఆ దేవదేవుడు ప్రసాదించాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద దీపావళి సంధర్భంగా దువ్వాడ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×