E-Paper
Advertisement

Complaint against CM Chandrababu: ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదు.. కార‌ణం ఇదే!

Complaint against CM Chandrababu: ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదు.. కార‌ణం ఇదే!
Advertisement

Complaint against CM Chandrababu: శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయవాడకు చెందిన దేవరకొండ నాగవర ప్రసాద్ పుల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను తాను ఏకలవ్య సంతానానికి చెందిన ఎరుకల కులస్తుడిగా పరిచయం చేసుకున్న ఆయన.. తమ జాతి మూల పురుషుడు ఏకలవ్యుడని పేర్కొన్నారు. తమ కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఇరుకు చెప్పడం వల్లే శ్రీనివాసుడి కల్యాణం జరిగిందనే ప్రసిద్ధి ఉందని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రాణదైవంగా పూజించే తమ సామాజిక వర్గానికి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారం తీవ్ర మనస్తాపం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను గాయపరిచేలా జిగుప్సాకరమైన పదజాలాన్ని ఉపయోగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్.. టీటీడీ ఈఓ శ్యామలరావు.. చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీరితో పాటు ఈటీవీ అధినేత చెరుకూరి కిరణ్.. ఏబీఎన్ రాధాకృష్ణ.. మహా ఛానల్ వంశీకృష్ణ వంటి మీడియా ప్రముఖులపై కూడా ఫిర్యాదు చేశారు. లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగా చర్చలు పెట్టి భక్తులు వినడానికే అసహ్యం కలిగేలా మాట్లాడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ తేదీల్లో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను పోలీసులకు అందజేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ.. రశీదు (Acknowledgment) ఇవ్వడానికి నిరాకరించారని.. దీనిపై తదుపరి న్యాయ పోరాటం చేస్తానని ప్రసాద్ వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం తాను మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు తెలిపిన ప్రసాద్.. గతంలో శ్రీకాకుళం డీటీసీలో విధులు నిర్వహించినట్లు చెప్పారు. అక్కడి నుండి అనంతపురం పీటీసీకి బదిలీ చేసినా.. అనారోగ్య కారణాల వల్ల సెలవును పొడిగించుకుంటున్నట్లు వివరించారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) కోరుతూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రావడం లేదని ఆరోపించారు. మార్చి 31 లోపు తన రాజీనామాను ఆమోదించాలని కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే లడ్డూ వివాదంపై సీఎం వ్యాఖ్యలు చేయడం వల్ల మనస్తాపానికి గురై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చట్టపరంగా ముందుకు వెళ్లి బాధ్యులకు శిక్ష పడేలా చూస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Sajjala: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×