E-Paper
Advertisement

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!
Advertisement

Toll Plaza Crowd: దసరా సెలవులు మొదలైన నేపథ్యంలో.. రోడ్ల మీద ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రైళ్లు, బస్సులు మాత్రమే కాకుండా, వ్యక్తిగత వాహనాలతో కూడా చాలామంది తమ సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగి, ప్రయాణికులు గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన నియమం ఉంది. అదే టోల్ ప్లాజాల వద్ద మినిమం వెయిటింగ్ టైం రూల్.

NHAI జారీ చేసిన సర్క్యులర్ ఏమంటోంది?

Advertisement

జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఇప్పటికే ఒక స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం, టోల్ బూత్ వద్ద ఒక్కో వాహనం 10 సెకన్లకు మించి ఆగాల్సిన అవసరం లేదు. అంటే ఒక వాహనం ఫీజు చెల్లించి ముందుకు వెళ్లేందుకు గరిష్టంగా 10 సెకన్ల సమయం మాత్రమే పట్టాలి.

అలాగే 100 మీటర్ల దూరం వరకు వాహనాల క్యూ ఉంటే, ఆ సమయంలో ఆగకుండా వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండానే ముందుకు వెళ్లవచ్చు. అంటే భారం ఎక్కువగా ఉన్నప్పుడు, లైన్ పొడవుగా ఉన్నప్పుడు టోల్ వసూలు చేసే అధికారం నిలిపివేయాలి. ఇది వాహనదారుల సౌకర్యం కోసం తీసుకున్న నిర్ణయం.

Advertisement

ఎందుకు తీసుకొచ్చారు ఈ రూల్?

భారతదేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో పాటు.. జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. పండుగల సమయంలో, ప్రత్యేకంగా దసరా, సంక్రాంతి, దీపావళి వంటి రోజుల్లో రోడ్ల మీద ట్రాఫిక్ మరింతగా పెరుగుతుంది.

ఈ సమయంలో టోల్ బూత్‌ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిలిచిపోవడం సాధారణం. ప్రయాణికులు గంటల తరబడి సమయం వృధా చేసుకోవలసి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు NHAI మినిమం వెయిటింగ్ టైం రూల్ను ప్రవేశపెట్టింది. దీని వల్ల సాఫీగా ట్రాఫిక్ క్లియర్ అవ్వడం, ఇంధనం ఆదా అవ్వడం, కాలుష్యం తగ్గడం జరుగుతుంది.

వాహనదారులు ఏమి చేయాలి?

ఈ రూల్ గురించి చాలామంది డ్రైవర్లు, వాహనదారులు తెలియకపోవడంతో, గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద ఆగిపోతున్నారు. దీనివల్ల వారి సమయం వృధా అవుతుందే కాకుండా, ప్రయాణం కూడా కష్టమవుతుంది.

అధికారులు చెబుతున్నట్లుగా:

వాహనదారులు NHAI సర్క్యులర్ గురించి అవగాహన కలిగి ఉండాలి.

టోల్ బూత్ వద్ద 100 మీటర్లకు పైగా క్యూ ఉంటే, టోల్ చెల్లించకుండా వెళ్లే హక్కు వారికి ఉంది.

అధికారులు, టోల్ సిబ్బంది కూడా ఈ నియమాలను.. అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు.

దసరా సమయంలో రద్దీ మరింత పెరగనుంది

ప్రస్తుతం ప్రారంభమైన దసరా సెలవుల రద్దీ వల్ల రాబోయే రోజుల్లో.. టోల్ ప్లాజాల వద్ద వాహనాల సంఖ్య మరింత పెరగనుంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విసాఖపట్నం వంటి ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా.

అందువల్ల డ్రైవర్లు ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం, ప్రయాణ సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం, ఫాస్ట్‌ట్యాగ్ వాడకం ద్వారా వేగంగా వెళ్లడం లాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.

టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు.. వాహనదారులకు టోల్ ఫీజు లేకుండానే వెళ్లే హక్కు ఉందని చాలా మందికి తెలియదు. ఈ నియమాన్ని అమలు చేయడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. అలాగే ఇంధనం, ధనం, శ్రమ వృధా కాకుండా ఉంటుంది.

Also Read: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

అందువల్ల ఇకనుంచి అయినా ప్రతి వాహనదారు ఈ రూల్ గురించి తెలుసుకొని, అవసరమైనప్పుడు వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దసరా వంటి పెద్ద పండుగల సమయంలో ఈ రూల్ అమలు మరింత కీలకం కానుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×