E-Paper
Advertisement

AP Elections : ఏపీలో ఎలక్షన్‌ హీట్‌.. ఓటర్ల నమోదుపై ఫిర్యాదుల వర్షం..

AP Elections : ఏపీలో ఎలక్షన్‌ హీట్‌.. ఓటర్ల నమోదుపై ఫిర్యాదుల వర్షం..
Advertisement

AP Elections : త్వరలో ఏపీలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఓట్ల నమోదు ప్రక్రియపై పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న అధికారులు వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో కేంద్ర ఎన్నికల ప్రతినిధులను కలిసి ఓట్ల నమోదులో అవకతవలపై ఫిర్యాదు చేశారు వైసీపీ, టీడీపీ నేతలు.

వైసీపీ తరపున మంత్రి జోగి రమేష్‌ మాజీ మంత్రి పేర్ని నానితోపాటు పలువురు వైసీపీ నేతలు ఈసీని కలిశారు. టీడీపీ, జనసేనలు కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దొంగే దొంగన్నట్టు చంద్రబాబు తీరు ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పేర్ని నాని, జోగి రమేష్‌. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ఇక మరోవైపు ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో అక్రమంగా ఓట్ల తొలగించారని.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు తెలిపింది టీడీపీ బృందం. ఫామ్ -7ను ఉపయోగిస్తూ తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు ధూళిపాళ్ల నరేంద్ర.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×