E-Paper
Advertisement

Jagan : శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. మూలపేట పోర్టుకు శంకుస్థాపన..

Jagan :  శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. మూలపేట పోర్టుకు శంకుస్థాపన..
Advertisement

Jagan : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మిస్తారు. 30 నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్ల వ్యయం చేయనుంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడుతుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

మూలపేట పోర్టుకు ఎన్‌హెచ్‌ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ 4 లైన్ల రహదారి నిర్మిస్తారు. నౌపడ జంక్షన్‌ నుంచి పోర్టు వరకు 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. గొట్టా బ్యారేజ్‌ నుంచి 50 కి.మీ.పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి 0.5 ఎంఎల్‌డీ నీటిని పోర్టుకు సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5 వేల ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

Advertisement

శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద , టెక్కలి నీలి గ్రానైట్‌ ఎగుమతికి, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్‌ కోల్, కోకింగ్‌ కోల్, ఎరువులు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడుతుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.

మరోవైపు విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 పోర్టు నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మిస్తోంది.

Advertisement

సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో నిర్మించే ఫిషింగ్‌ హార్బర్‌కు, హిర మండలం రిజర్వాయర్‌కు, వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×