E-Paper
Advertisement

Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..

Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్.. వసతి దీవెన నగదు జమ చేయనున్న సీఎం..
Advertisement

Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఆ తర్వాత నార్పల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ వేదికపై నుంచే జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేస్తారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.

Advertisement

వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు విడతల్లో ప్రభుత్వం ఆర్ధికసాయం అందిస్తోంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్, డిగ్రీ లాంటి ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున అందిస్తోంది. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×