E-Paper
Advertisement

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..
Advertisement

Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులుగా కడప జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. మూడో రోజు పులివెందుల సీఎస్‌ఐ చర్చిను సందర్శించారు. అక్కడ
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తోపాటు ఆయన తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

Advertisement

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు వేడుకులు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలతో అన్ని చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×