E-Paper
Advertisement

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!

CM Jagan Stone Pelting Case: జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..!
Advertisement

Jagan Stone Pelting Case Accused gets bail: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ కు బెయిల్ మంజూరయ్యింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ విచారణకు సహకరించాలని సతీశ్ ను ఆదేశించింది. శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

అయితే, ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా విజవాయడలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎంపై దాడి చేశాడు. రాయి తగలడంతో జగన్ ఎడమకంటి కనుబొమ్మకు తీవ్ర గాయమయ్యింది.

Advertisement

Also Read: లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. త్వరలో రాజకీయాల్లోకి ఎన్టీఆర్..?

అదేవిధంగా సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయం అయ్యింది. వెంటనే డాక్టర్లు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తరువాత సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సతీశ్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. ఈ నెల 18న సతీశ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×