E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపిక పూర్తి.. మంగళగిరి సభలో సీఎం జగన్..

CM Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపిక పూర్తి.. మంగళగిరి సభలో సీఎం జగన్..
Advertisement

CM Jagan Mohan Reddy speech

CM Jagan Mohan Reddy speech(Political news in AP): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్తుల ఎంపిక పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నది జ్ఞాపకం పెట్టుకొని పార్టీ క్యాడర్ పని చేయాలని సూచించారు.

Advertisement

శాసన సభ, లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లేనని సీఎం జగన్ అన్నారు. చాలా స్వల్ప మార్పులు ఉంటే ఉండవచ్చన్నారు.మార్చాల్సినవి ఇప్పటికే 99 శాతం మార్చామని పేర్కొన్నారు. ఇక పెద్ద మార్పులేవీ ఉండవని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి కుటుంబానికి ఐదారు సార్లు కాలవాలని ఆయన సూచించారు.

Read More:  క్రికెట్‌లో రాజకీయం.. విహారికి మద్దతుగా అశ్విన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

Advertisement

సోషల్ మీడియాలో క్యాడర్ యాక్టీవ్ గా ఉండాలని సీఎం జగన్ అన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. ఇంచార్జీ బాధ్యతలు చేపట్టినవారే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×