E-Paper
Advertisement

Jagan : ఆ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..?

Jagan : ఆ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..?
Advertisement

Jagan : వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

వాస్తవంగా సోమవారం సీఎం అనంతపురం జిల్లాలో పర్యటించారు. నార్పలలో వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఆదివారం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత సీఎం పర్యటన వాయిదా పడింది. అప్పటి నుంచే వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు సీఎం జగన్ అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీకావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్‌ రెడ్డి.. పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయల్దేరినపుడు ఆయనతోపాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాష్‌తో చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు చెవిరెడ్డి వివరించారని సమాచారం. ఎంపీ అవినాష్‌ రెడ్డి విషయంలో జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×