E-Paper
Advertisement

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?
Advertisement

Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయలు దేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సాయంత్రం 5:03 కి విమానం ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. సీఎంకు సెండాఫ్ పలికిన అధికారులు రిటర్న్ అయ్యారు. కట్ చేస్తే…

ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం తిరిగి 5:26 కల్లా మళ్లీ గన్నవరం విమానాశ్రయంలోనే ల్యాండైంది. ఈసారి ఎమెర్జెన్సీ ల్యాండ్. విషయం తెలిసి అంతా హడలిపోయారు.

Advertisement

విమానంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు ఉన్నారు.

ఫ్లైట్ గన్నవరం నుంచి బయలు దేరాక.. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు పైలైట్. వెంటనే రిటర్న్ తీసుకుని.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విమానంలో లోపం ఇప్పటికిప్పుడు సరిదిద్దే సమస్య కాకపోవడంతో తాడేపల్లికి తిరిగి వెళ్లిపోయారు సీఎం జగన్. సోమవారం నాటి ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని సెక్యూరిటీ వింగ్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశించింది. విమానంలో ఏసీ పని చేయట్లేదని తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×