E-Paper
Advertisement

CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..

CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..
Advertisement

CM Jagan : విశాఖపట్నం నుంచే పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తొలుత ఉగాది నుంచి వైజాగ్ కు షిప్ట్ అవ్వాలని భావించారు. అయితే అమరావతిపై పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదు. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. మరి ఏపీ ప్రభత్వం వెనక్కి తగ్గిందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ ఇష్యూ జనంలోకి వెళ్లకముందే గంటల వ్యవధిలోనే సీఎం జగన్ రాజధాని తరలింపుపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైజాగ్ నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

Advertisement

విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తామని ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. విశాఖ కేంద్రం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో విశాఖ రాజధాని అని అటు సీఎం జగన్, ఇటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుకోసమే ప్రభుత్వం వేచిచూస్తోంది. తీర్పురాగానే అధికారికంగా రాజధాని తరలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×