E-Paper
Advertisement

CM Chandrababu Naidu : జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు అందజేస్తాం : సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

CM Chandrababu Naidu : జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు అందజేస్తాం : సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
Advertisement

CM Chandrababu Naidu to pensioners(AP latest news): జూలై 1వ తేదీ నుంచే పెంచిన పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన పెన్షన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎల్లుండి నుంచే పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా స్కీం కింద పెంచిన రూ.1000తో కలిపి పెన్షన్లను అందజేస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఒకేసారి రూ.1000 పెంచి పెన్షన్లను అందజేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు.

దివ్యాంగులకు ఇకపై నెలకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకూడదని, ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించి.. ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతినెలా అదనంగా రూ.819 కోట్ల భారం ఉండనుందని తెలిపారు. గత ప్రభుత్వం పెన్షన్ దారులను ఎంతో క్షోభకు గురిచేసిందని, వారి కష్టాలను చూసి చలించిపోయానని లేఖలో పేర్కొన్నారు. ఎర్రటి ఎండలో.. వడగాల్పుల్లో పెన్షన్ల కోసం పడిన కష్టాలను చూసే.. ఏప్రిల్ నుంచి రూ.1000 పెంచిన పెన్షన్లను అమలు చేసి.. జులై 1న రూ.7 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×