E-Paper
Advertisement

CM Chandrababu: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..అక్కడే మాజీ రాష్ట్రపతి, ఎందుకు?

CM Chandrababu: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..అక్కడే మాజీ రాష్ట్రపతి, ఎందుకు?
Advertisement

CM Chandrababu Met Governor: ఏపీ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతోందా? అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయా? శుక్రవారం రాత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక కారణమేంటి? ఆ భేటీలో మాజీ రాష్ట్రపతి కూడా ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది? డీటేల్స్‌లోకి వెళ్తే..

రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో తెలీదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. శుక్రవారం రాత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. అక్కడే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి వారంతా చర్చించుకున్నారన్నది అసలు సారాంశం.

Advertisement

టీడీపీ పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. అమెరికాలో అదానీ కేసు వ్యవహారంపై చిన్నపాటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు నిధులు ఇచ్చినట్టు మీడియా కథనాల నేపథ్యంలో చర్చించారట. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారన్నది అమెరికా ప్రభుత్వ ఆరోపణ.

ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారిస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా అనేదానిపై ముఖ్యమంత్రి ఆరా తీశారట. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేపడితే అనుమానాలు తొలగించినట్టు అవుతుందని, లేకుంటే నేతలంతా ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి వెళ్తుందని అన్నారట.

Advertisement

ALSO READ:  ఆకాశంలో డ్రోన్లు.. వణికిపోతున్న విజయవాడ ప్రజలు

గత ప్రభుత్వంలో సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వజూపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎంను విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో  గవర్నర్, మాజీ రాష్ట్రపతి నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయనేది సస్పెన్స్‌గా మారింది.

సోలార్ విద్యుత్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి అధికారులను రేపో మాపో విచారించే అవకాశమున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అధికారుల తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దను విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×