E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ, విస్తరణ ప్రణాళిక..

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ, విస్తరణ ప్రణాళిక..
Advertisement

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సమావేశయ్యారు. శుక్రవారం ఉదయం అమరావతిలో ఇరువురు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు. చంద్రబాబు సర్కార్ విజన్ గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.

ఏపీలో పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు-టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మధ్య చర్చలు జరిగా యి. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 రూప కల్పన అంశాలపై మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచన లు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది చంద్రబాబు సర్కార్. దీనికి కో-ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు.

Advertisement

అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో నెలకొల్పనున్న గ్లోబల్ లీడర్‌షిప్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో టాటా గ్రూపు భాగస్వామి కానుంది. విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు, ఎయిరిండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విస్తరణ అంశాలపై సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపారు. మరోవైపు సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ఫ్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా చర్చ జరిగినట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×