E-Paper
Advertisement

CM Chandrababu Delhi Tour: ఏపీ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకు..?

CM Chandrababu Delhi Tour: ఏపీ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకు..?
Advertisement

CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌‌లో  భాగంగా తొలుత అమిత్ షాను కలిసిన తర్వాతే ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. విభజన అంశాలతోపాటు రాజకీయాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు కేబినెట్ మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల హామీలు, ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇవేకాకుండా మిగతా శాఖల గురించి వచ్చిన డీటేల్స్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ తర్వాత బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.  ఇదిలావుండగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన సమస్యలపై
కేంద్రంలో చర్చించనున్నారు.

Also Read: కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Advertisement

తొలుత హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఆర్థిక పరిస్థితి గురించి వివరించి విభజన సమస్యలపై ఆయనతో మాట్లాడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చాలావరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అయితే ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

మరోవైపు ఈనెల 23న కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా ఏమైనా సాయం చేయాలని కోరనున్నారు. అమిత్ షా భేటీ తర్వాత వీలైతే ప్రధాని నరేంద్రమోదీతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అవుతారని అంటున్నారు. పనిలోపనిగా ఏపీలో రాజకీయ అంశాలపై చర్చించ నున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×