E-Paper
Advertisement

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఒక్కరోజు ముందే నగదు పంపిణీ

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. ఒక్కరోజు ముందే నగదు పంపిణీ
Advertisement

CM Chandrababu Good News To Pensioners: పెన్షన్‌దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే ఈ సారి ఒక్కరోజు ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆగస్టు 31న పెన్షన్‌దారులకు పెన్షన్లు అందనున్నాయి.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతినెల 1వ తేదిన పంపిణీ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతోపాటు అదే రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఇవ్వనున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందనుంది. ఒకవేళ ఆగస్టు 31న లబ్ధిదారులు పెన్షన్లను తీసుకోని సమక్షంలో వారికి సెప్టెంబర్ 2న సోమవారం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అంతకుముందు ఏపీ కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నగదును పెంచింది. గత ప్రభుత్వం రూ.3వేలు అందజేస్తుండగా..కూటమి ప్రభుత్వం రూ.1000 పెంచి మొత్తం రూ.4వేలు అందజేస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దనే పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు అందించగా..కూటమి ప్రభుత్వం కూడా ఇంటివద్ద అందజేస్తుంది. కానీ వార్డు వాలంటీర్లకు బదులు..సచివాలయ సిబ్బంది నేరుగా నగదు అందజేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×