E-Paper
Advertisement

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు
Advertisement

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఆయుధాల కొనుగోలునే అభివృద్ధిగా భావిస్తోందని విమర్శించారు. ప్రజలకు కావలసింది సుపరిపాలన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నేరాలకు కేంద్రంగా మారుతోందని చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విపరీతమైన అవినీతి రాష్ట్రంగా మారిపోయిందని, దాదాపు రూ.2వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో 50 ఏళ్లు ఉండాల్సిన చంద్రబాబు, కేసీఆర్‌కు భయపడి ఏపీకి వచ్చేశారని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ కుటుంబం 11 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగాలన్నా‘ఆ నలుగురు బ్రోకర్ల’ హవా నడుస్తోందని, వారి ప్రమేయం లేకుండా ఏ పని కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొంటూ, అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల సామాన్యులపై భారం పడనుందని హెచ్చరించారు. రాబోయే 20 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 1500 రూపాయలకు చేరుకోనుందని, ఇది ప్రజల నడ్డి విరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×