E-Paper
Advertisement

Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..

Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..
Advertisement

చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ రహ్మతుల్లాను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో ఎస్‌ఐ రహ్మతుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

గతంలో వెంకటనాయుడు వద్ద నుంచి మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు రెండు కార్లను రహ్మతుల్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రమాదం జరిగిన రోజున వెంకటనాయుడు గ్యాంగ్ సభ్యులతో ఎస్‌ఐ రహ్మతుల్లా ఫోన్‌లో పలుమార్లు మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరింత అనుమానాస్పద అంశంగా, ఈ ప్రమాదం తన అధికార పరిధిలోకి రాకపోయినా రహ్మతుల్లా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటనాయుడు తండ్రి అయిన ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ను కూడా అధికారులు బదిలీ చేశారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×