E-Paper
Advertisement

Chennai: తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai:  తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..
Advertisement

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థు లు స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవారు.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలవు రావడంతో కారులో తమిళనాడు వెళ్లారు. శనివారం కారులో వీరంతా తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి కాలేజీకి బయలుదేశారు.

Advertisement

తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి కారు రాగానే వేగంగా వచ్చిన కంటెయినర్ ట్రక్కు వీరిని ఢీ కొట్టింది. లారీ వేగానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఐదుగురు స్టూడెంట్స్ స్పాట్‌లో మృతి చెందా రు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ALSO READ: అలర్ట్.. తిరుమలలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు

Advertisement

మృతులంతా ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రొద్దుటూరుకి చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేశ్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను సతీష్‌లు ఉన్నారు. వీరంతా చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.

విష్ణు, చైతన్యలకు గాయాలయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ తిరువళ్లూరులోని ప్రభుత్వం ఆసుపత్రిలో కోలు కుంటున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×