E-Paper
Advertisement

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?
Advertisement

Tirumala : అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. దర్శనం కోసం వెళ్తున్న భక్తులపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మరో బాలికి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత భక్తులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతలను బంధించే ఆపరేషన్ టీటీడీ అధికారులు చేపట్టారు. అలిపిరి మార్గంలో చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.

దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు నడకమార్గంలో భయాందోళన చెందుతున్నారు. అయితే అలిపిరి మార్గంలో 8 చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను టీటీడీ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఖండించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. 8 చిరుతలు సంచారమనేది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఇప్పటివరకు 4 చిరుతలను మాత్రమే గుర్తించామని చెప్పారు.

Advertisement

నడకదారి భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఫారెస్ట్ అధికారి తెలిపారు. చిరుతలను గుర్తించడానికి ప్రత్యేకంగా 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. దీని వల్ల చిరుతల సంచారాన్ని సులభంగా గుర్తించవచ్చని అన్నారు. చిరుతల బెడదపై దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం కోసం టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకే ఏపీ అటవీశాఖ అనుమతులతో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక బోనుల ఏర్పాటు చేశామని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×