E-Paper
Advertisement

Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..

Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..
Advertisement

Chandrababu Mahanadu Speech(Latest news in Andhra Pradesh): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహానాడు వేదికపై నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ మనల్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ ముందుకెళతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీని దెబ్బతీద్దామని చాలామంది ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదని విమర్శించారు. వారికి పీఆర్సీ కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

Advertisement

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడానికే 60 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చారని స్పష్టం చేశారు. పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా పేర్కొన్నారు. ఆ మహనీయుడి పేరు చెబితే సంక్షేమ పథకాలే గుర్తొస్తాయన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×