E-Paper
Advertisement

Chandrababu: విశాఖను వాణిజ్య రాజధాని చేస్తాం.. ఉత్తరాంధ్రులకు చంద్రబాబు కీలక హామీ

Chandrababu: విశాఖను వాణిజ్య రాజధాని చేస్తాం.. ఉత్తరాంధ్రులకు చంద్రబాబు కీలక హామీ
Advertisement

Chandrababu: ఉత్తరాంధ్రను ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ప్రజల ఆస్తులను జగన్ బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు.

విజయనగరం జిల్లాలోని రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ హయంలో చేపట్టిన పనులు ఉత్తరాంధ్రలో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చంద్రబాబు అన్నారు.

Advertisement

టీడీపీ చేపట్టిన పనులను వైసీపీ పక్కన పెట్టేసి.. విశాఖను గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మార్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు.

గతంలో తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి మెడ్ టెక్ పార్కులు, అదానీ డేటా సెంటర్, లులు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తీసుకువస్తే.. వైసీపీ వాటన్నింటినీ తరిమి కొట్టిందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.

Advertisement

కూటమి అధికారంలోకి వస్తే 25 వేల కానిస్టేబులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు యువతకు హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.25 వేలు అందిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×