E-Paper
Advertisement

Chandrababu : కుప్పంలో చంద్రబాబు పర్యటన.. టీడీపీ శ్రేణుల్లో జోష్..

Chandrababu :  కుప్పంలో చంద్రబాబు పర్యటన.. టీడీపీ శ్రేణుల్లో జోష్..
Advertisement

Chandrababu kuppam meeting(AP breaking news today): చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధవారం కర్ణాటక సరిహద్దులో టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, చిన్నారిదొడ్డి క్రాస్‌రోడ్డు కూడలిలో చంద్రబాబు ప్రసంగించారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని బాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్‌ను వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరని మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఇదే విమర్శ చేశారని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా విశాఖలో ఇదే అంశాన్ని చెప్పారని.. మరి ఈ సీఎంపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు.

కుప్పంలో పార్టీ నేతలతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పులివెందులలో టీడీపీని గెలిపించకపోయినా.. అక్కడి ప్రజలకు కుప్పం కన్నా ముందుగా నీళ్లు ఇచ్చానన్నారు. తాను హంద్రీ-నీవా పనులు చాలా వరకు పూర్తి చేసి రామకుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చానని తెలిపారు. మిగిలిన ప్రాంతానికి జగన్‌ నీటి తీసుకురాలేకపోయారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే 18-59 ఏళ్ల మహిళలకు నెలనెలా రూ.1500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను చదవించే వారికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. మహిళలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడకూడదనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చానన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగడం వల్లే 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.

Advertisement

శాంతిపురం మండలం శివపురం వద్ద ఇల్లు కట్టుకోవడానికి ఈ సీఎం అనుమతి ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.ఈ రాష్ట్రమేమైనా మీ తాతల జాగీరా? అని నిలదీశారు. కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. పార్టీలోకి భారీగా చేరికలకు ఉంటాయని తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×