E-Paper
Advertisement

Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు.. తేల్చేసిన చంద్రబాబు

Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు.. తేల్చేసిన చంద్రబాబు
Advertisement

Chandrababu: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు టిడిపి అవసరం ఎంతో ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని తేల్చేశారు. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగా లేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా చూపించి పక్కన ఉంచుతాం గానీ.. పార్టీ ప్రయాజనాలను పణంగా పెట్టలేమన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్ ఛార్జ్ లు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఏం జరిగినా పార్టీ అధిష్టానమే చూసుకుంటుందిలే అని అలసత్వం వహించరాదని ఖరాకండిగా చెప్పేశారు. టిడిపి-జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. జగన్ ను ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు.

Advertisement

గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు ఆరోపించారు. వారంతా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనను వివరించారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×