E-Paper
Advertisement

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..

Chandrababu Speech: కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? చంద్రబాబు హామీల వర్షం..
Advertisement
chandrababu speech

Chandrababu naidu latest news(AP politics) : YCP అంటే కరప్షన్‌.. TDP అంటే డెవలప్మెంట్‌ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డెఫినేషన్‌ చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన బాబు.. మచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. నందికొట్కూరులో రోడ్‌ షోలో జగన్‌పై విరుచుకుపడ్డారు. కర్నూల్‌కు న్యాయ రాజధాని వచ్చిందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త విద్యుత్‌ పాలసీతో పాటు 3 సిలిండర్లు ఇస్తామన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.

రాయలసీమ కోసం జగన్‌ ఏనాడైనా పనిచేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సీమలో రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని.. సీమ ద్రోహి జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.2వేల కోట్లేనని చెప్పారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ.. 3 రాజధానులు కడతారా? అని నిలదీశారు. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు అంటున్నారని మండిపడ్డారు.

Advertisement

జగన్ బటన్‌ నొక్కడం కాదు.. బటన్‌ బుక్కుడు ఎక్కువైంది అంటూ పంచ్‌లు వేశారు. విద్యుత్‌ ఛార్జీలు ఇప్పటికే 8 సార్లు పెంచారని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని.. పాత మద్యం విధానం తెచ్చి లిక్కర్ రేట్ తగ్గిస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 20 లక్షలకుపైగా ఉద్యోగాలు.. ఇలా అనేక హామీలు గుప్పించారు చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×