E-Paper
Advertisement

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం
Advertisement
Chandrababu Release Update

Chandrababu naidu news today(AP politics) :

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు బయలుదేరగా.. టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ఆయనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునేందుకు 14 గంటలకు పైగా సమయం పట్టింది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ మారింది. వాస్తవానికి ఇవాళ తిరుపతికి వెళతారని.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లాలని భావించారు. కానీ ఆయన నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని.. ఎవరినీ కలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

దాదాపు పద్నాలుగనర్న గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు అలసిపోయారు. చంద్రబాబు ఇంటికి చేరుకునే సరికే.. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళలు భారీగా గుమిగూడారు.పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నినాదాలు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×